ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిద్దాం – ఎమ్మెల్యే బాలకృష్ణ

-

తాను ఆంధ్ర హిందూపురం ఎమ్మేల్యే అయినా తెలంగాణకు సేవలు చేస్తానన్నారు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. టిడిపి సంవత్సరాల క్రితం ఒక వెలుగు వెలిగిందని.. ఆ వెలుగు వెయ్యి ఎండ్లు వెలుగుతుందన్నారు. తెలుగువాడి ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని నిలపెట్టింది ఎన్టీఆర్ అని అన్నారు బాలకృష్ణ. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్ పెట్టిన పథకాలు ఇంకా కొనసాగుతున్నాయని.. ఇప్పుడు అవ్వే పథకాలకు పేర్లు మార్చి ఇప్పుడు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ, ఎన్టీఆర్ తయారు చేసిన నాయకులు ఎంతో మంది వేరే పార్టీలలో ముఖ్య నాయకులుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని.. ఎన్టీఆర్ కు కాకుండా ఇంకా ఎవరు అర్హులు భారతరత్నకు? అని ప్రశ్నించారు. మా పార్టీ తరపున, మా కుటుంభం తరపున కేంద్ర ప్రభుత్వంను అభ్యర్దిస్తున్నానన్నారు. రాబోయే ఎన్నికల్లో మనసత్తాను చూపించాలని.. నేను మీకు అండగా ఉంటానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news