ఇవాళ, రేపు ఏపీలో చంద్రబాబు పాదయాత్ర

-

ఏపీలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు. ఇవాళ, రేపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రైతు పోరుబాట పేరుతో భారీ నిరసన కార్యక్రమం చేపట్టనుంది టీడీపీ పార్టీ. ఇందులో భాగంగానే, ఇవాళ సాయంత్రం తణుకు చేరుకుని నేతలతో సమావేశం కానున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

12 వ తేదీ ఉదయం అంటే రేపటి నుంచి సాయంత్రం వరకు 12 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు చంద్రబాబు నాయుడు. ఇరగవరం నుంచి తణుకు వరకు పాదయాత్ర చేపట్టనున్నారు చంద్రబాబు. ఆకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news