నరేశ్, పవిత్రల ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్..రమ్యకు కౌంటర్‌ ఇచ్చేశాడుగా

-

నరేష్‌ హీరోగా మళ్లీ పెళ్లి అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ సీనియర్ దర్శకనిర్మాత ఎమ్మెస్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా అందులో రమ్య రఘుపతి తో గొడవలు, ఆమె మీడియా ముందుకు వచ్చి చేసిన ఆరోపణలు, అలాగే రమ్య నరేష్ పై చేయించిన దాడులు అన్నింటినీ కూడా తమ నిజ జీవిత ఆధారంగా తెరకెక్కించిన సన్నివేశాలను మనం ఇందులో చూడవచ్చు.

అయితే…నటులు నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన ఈ ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. వారిద్దరి నిజజీవితంలో సంఘటనలను ఆధారంగా చేసుకుని మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మ్యూజిక్, మెచ్యూర్డ్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. MS రాజు డైరెక్షన్ వహించిన ఈ చిత్రం ఈనెల 26న రిలీజ్ కానుంది. ‘ప్రేమ&యుద్ధంలో ఏం చేసినా కరెక్టే’ అని నరేష్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news