వచ్చే దసరాకు సింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్ -సిఎం కెసిఆర్

-

2014లో సింగరేణి టర్నోవర్ రూ. 11 వేల కోట్లు ఉంటే ఇప్పుడది రూ. 33 వేల కోట్లకు చేరుకుందని సీఎం కేసీఆర్ మంచిర్యాల సభలో అన్నారు. అదేవిధంగా లాభాలు రూ. 300-400 కోట్లు మాత్రమే ఉంటే….ఈ ఏడాది రూ. 2,184 కోట్లకు పైగా లాభాలు వచ్చాయన్నారు. ఈ లాభాల వల్ల వచ్చే దసరాకు సింగరేణి కార్మికులకు పంచబోయే బోనస్ రూ. 700 కోట్లుగా ఉంటుందని తెలిపారు.

అలాగే, మంచిర్యాల సభా వేదికగా దివ్యాంగులకి శుభవార్త చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. వికలాంగుల పెన్షన్ మరో వెయ్యి పెంచుతూ సంచలన చేశాడు. వచ్చే నెల నుంచి రూ.4116 ఇస్తామని వెల్లడించారు సీఎం కేసీఆర్‌. నిన్న మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు.

Read more RELATED
Recommended to you

Latest news