దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి

-

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో శాఖ ఆధ్వర్యంలో 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ అట్టహాసంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. గురువారం రోజున తెలంగాణ వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఇక రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు పట్టణ ప్రగతి వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మున్సిపల్ కార్యాలయాల్లో  వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో వైభవంగా వేడుకలు జరగనున్నాయి.

ఈ కార్యక్రమానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్​తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారు. ఉత్తమ మున్సిపాలిటీ, కార్పొరేషన్ల వార్డు కౌన్సిలర్లను, ఛైర్మన్లను, మేయర్లను, ఉద్యోగులను ఈ సందర్భంగా ప్రభుత్వం సత్కరించనుంది. ఆయా మున్సిపాలిటీలలో చేపట్టిన అభివృద్ధి పనులు, కార్యక్రమాలు, పట్టణ పారిశుద్ధ్యం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరును ప్రజలకు వివరించాలని సూచించింది. జాతీయ స్థాయిలో పట్టణ అభివృద్ధిలో సాధించిన విజయాలు, అవార్డుల వివరాలను ఈ ఉత్సవాల్లో ప్రదర్శించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news