BREAKING : కుప్పంలో భారీ పేలుడు

-

ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటుచేసుకుంది. కుప్పంలో ఓ నాటుబాంబు పేలి ఇల్లు ధ్వంసం అయింది. ఈ సంఘటన ఇవ్వాళ ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… కొందరు గుర్తుతెలియని వ్యక్తులు… కుప్పంలోని ఓ ఇంట్లో నాటు బాంబు వేసి వెళ్లారు. అయితే ఆ నాటుబాంబు పేలి ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది.

ఈ సంఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందుతుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి గుమ్మం దగ్గర నాటుబాంబు పేల్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ సంఘటనలో మురుగేష్ మరియు ధనలక్ష్మి దంపతులు తీవ్రంగా గాయపడగా… వారిని కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ పేలుళ్ల వెనుక ఎవరు ఉన్నారు… కావాలనే చేశారా ? లేక మరేదైనా కారణం ఉందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాటు బాంబుల లేక జిలి టెన్ స్టిక్సా అన్నది తెలిసే పనిలో పోలీసులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news