మరో ట్వీట్​తో నెట్టింట అనసూయ రచ్చ.. నా పేరు తీయకుండా మాట్లాడలేకపోతున్నారంటూ..

-

అనసూయ భరద్వాజ్.. ఈ భామ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరో ట్వీట్​తో నెట్టింట రచ్చ లేపింది. ‘నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేకపోతున్నారు’ అంటూ ఈ భామ చేసిన ట్వీట్‌ తాజాగా నెట్టింట చర్చనీయాంశమవుతోంది. ఎవరిని ఉద్దేశించి ఆమె ఈ ట్వీట్ చేసిందోనని గెస్ చేయలేక నెటిజన్లు తలపట్టుకుంటున్నారు. కామెంట్ల రూపంలో వారు క్వశ్చన్ల వర్షం కురిపిస్తున్నారు.

‘మళ్లీ ఏమైంది మేడమ్‌?’, ‘మిమ్మల్ని ఎవరు ఏమన్నారు?’ అని అడుగుతున్నారు. ‘‘వావ్‌! నేను నిజంగా చాలా చాలా ముఖ్యమైనదాన్ని. నా ప్రమేయం ఉన్నా లేకున్నా, నాకు సంబంధం ఉన్నా లేకున్నా.. నా పేరు ఎత్తకుండా ఒక్క డిస్కషన్‌ కూడా జరగదంటే.. నాపై అంత డిపెండ్‌ అయి ఉన్నారు. నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేకపోతున్నారు’’ అని ట్వీట్ చేసింది అనసూయ. ఇంతకుముందు పలు సందర్భాల్లో అనసూయ పరోక్షంగా పెట్టిన ట్వీట్‌లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ట్వీట్ పెట్టి నెట్టింట రచ్చ షురూ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news