నేటి నుంచి 10 రోజుల పాటు రైతు సభలు

-

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి 10 రోజుల పాటు రైతు సభలు జరుగనున్నాయి. ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ నేతల వాక్యాలకు నిరసనగా నేటి నుంచి 10 రోజులపాటు రైతు సభలను BRS నిర్వహించనుంది.

ప్రతి వేదిక వద్ద వెయ్యి మంది రైతులతో సమావేశం నిర్వహించి, కాంగ్రెస్ కుట్రలను విడమరిచి చెప్పాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు ఆదేశించారు. 3 గంటల కరెంట్ కావాలా? 3 పంటలు కావాలా? అనే నినాదంతో దూకుడుగా వెళ్లాలని సూచించారు. దీంతో BRS నేతలు అన్ని నియోజకవర్గాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news