BRS లో అన్ని సింహాలే..మళ్లీ గెలువబోతున్నాం – కవిత

-

BRS లో అన్ని సింహాలే..మళ్లీ గెలువబోతున్నామని ప్రకటించారు కల్వకుంట్ల కవిత. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈనెల 29న ఐటి హబ్ ప్రారంభం అవుతుందని.. బి.ఆర్.ఎస్. లో అన్ని సింహాలే, కొన్ని పార్టీల్లో గ్రామ సింహాలు ఉన్నాయని చెప్పారు.

ఎంపీ అర్వింద్ బాల్కొండ లో అతిగా అసభ్యంగా మాట్లాడారని.. ప్రజలే ఆయనకు బుద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణ లో సంపద సృష్టించం అవినీతి రహిత పాలన అందిస్తున్నామన్నారు. బీజేపీ కాంగ్రెస్ పాలన లో అవినీతి జరగలేదా..? అని ప్రశ్నించారు. అండర్ గ్రౌండ్ డ్రైనెజీ డబ్బులు ఏ కుటుంబం తిన్నదో ప్రజలకు తెలుసన్నారు కవిత. ఎంపీ అర్వింద్ పిచ్చి ప్రేలాపణలు చూస్తున్నారని… 24 గంటల సమయం ఇస్తా ఆరోపణలు నిరూపించు, లేకపోతే ముక్కు నేలకు రాయంటూ సవాల్‌ విసిరారు కల్వకుంట్ల కవిత.

Read more RELATED
Recommended to you

Latest news