ఎమర్జింగ్ ఆసియా 2023:జోరుమీదున్న బంగ్లాదేశ్ … ఓటమి కోరల్లో ఇండియా !

-

బంగ్లాదేశ్ మరియు ఇండియా ల మధ్యన శ్రీలంక వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ ఆసియా కప్ సెమీఫైనల్ 2 లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత ఓవర్ లలో 211 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అంచనాలకు తగినట్లు రాణించడంతో ఇండియా ఆటగాళ్లు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. కెప్టెన్ యష్ దుల్ (66) ఒక్కడే చివరి వరకు ఉండి కనీసం ఆ మాత్రం స్కోర్ అయినా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇండియాను బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కట్టడి చేశారు. 212 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్ ప్రారంభించిన బంగ్లా వేగంగా ఆడుతోంది. మొదటి ఓవర్ లోనే నాలుగు ఫోర్లు కొట్టి 16 పరుగులు రాబట్టుకున్నారు. ఇక బంగ్లా ఇన్నింగ్స్ సాగుతున్న తీరు చూస్తే ఇక ఇండియా గెలవడం కష్టమే అన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బంగ్లాదేశ్ 17 ఓవర్ లలో ఒక్క వికెట్ కోల్పోయి 93 పరుగులు చేసింది. మరి ఏమైనా అద్భుతం జరుగుతుందా చూద్దాం ..

Read more RELATED
Recommended to you

Latest news