మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయంపై తెలంగాణ సర్కార్ జీవో జారీ

-

మైనారిటీలకు శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. ఈ మేరకు ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మైనార్టీలకు రూ, లక్ష ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని పేద మైనారిటీలకు ఆర్థిక సాయం అందించే నూతన పథకంపై నేడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకే ఈ ఆర్థిక సాయం అందించనున్నారు. కెసిఆర్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పై మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇదే కాకుండా.. తెలంగాణలోని దివ్యాంగులకు రాష్ట్ర సీఎం కేసీఆర్‌ తీపి కబురు అందించారు. ఇప్పటి వరకు వారికి రాష్ట్ర సర్కార్ అందిస్తున్న ఆసరా పింఛన్‌ను రూ.4,016కు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన పింఛన్‌ జులై నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news