జనసేన పార్టీ టచ్ లోకి వట్టి, హర్షకుమార్ ?

-

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ నిర్వహిస్తున్న వారాహి యాత్ర మూడో విడత షెడ్యూల్‌ కు ముహుర్తం ఫిక్స్‌ అయింది. తాజాగా, మూడో విడత వారాహి యాత్ర షెడ్యూలుపై జనసేన కసరత్తు చేస్తోంది. ఈ నెల 27 లేదా 29వ తేదీ నుంచి మూడో విడత వారాహి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మూడో విడతలో ఉభయ గోదావరి జిల్లాలకే ప్రాధాన్యతనిద్దామా..? లేక ఉత్తరాంధ్రకు వెళ్దామా అనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు జనసేన పార్టీ నేతలు. ఇక అటు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్ర మూడో విడత లో జనసేనలో కీలక చేరికలు ఉండే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల్లో కీలక నేతల కుటుంబాల నుంచి చేరికలు ఉంటాయంటోన్నాయి జనసేన వర్గాలు. వట్టి, హర్షకుమార్ కుటుంబాలకు టచ్ లోకి వెళ్లినట్లు జనసేన నేతలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news