కుట్రతోనే గన్మెన్లను తొలగించారు – కన్నా లక్ష్మీనారాయణ

-

మాజీమంత్రి, సత్తెనపల్లి టిడిపి ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణకు షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. ఆయన గన్మెన్లను తొలగించింది. గత మూడు రోజులుగా కన్నా గన్మెన్లు విధులకు రావడం లేదు. దీనిపై ఆరా తీస్తే కన్నాకు భద్రతను ఉపసంహరించినట్లు తేలింది. అయితే కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా వారిని తొలగించడం ఏమిటని టిడిపి నేతలు మండిపడుతున్నారు. దీనిపై తాజాగా కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. కుట్రలో భాగంగానే తన గన్మెన్లను తొలగించారని ఆరోపించారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఇలాంటి చర్యలకు దిగారని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుండి కుట్రలు, కుతంత్రాలు, అవినీతి, దోపిడీ, హత్యలు తప్ప మరో కార్యక్రమం చేపట్టడం లేదన్నారు. జగన్ ని ఇంటికి పంపించడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు కన్నా లక్ష్మీనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news