చిలకలూరిపేట మద్యం షాపులన్నీ విడదల రజిని అధీనంలోనే ఉన్నాయి – ప్రత్తిపాటి పుల్లారావు

-

మంత్రి విడుదల రజినిపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. పసుమర్రు లో తాగునీటి పైప్ లైన్ పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలంటూ సెల్ఫీ చాలెంజ్ విసిరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పైప్ లైన్ పనులు 90% పూర్తయినా ఎందుకు అందుబాటులోకి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. మంత్రికి తెలిసిందల్లా కేవలం దాచుకోవడం, దోచుకోవడమేనని విమర్శించారు.

చిలకలూరిపేటలో మద్యం షాపులన్నీ మంత్రి రజిని అధీనంలోనే ఉన్నాయని ఆరోపించారు. 6 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే రెండు ఎత్తిపోతల పథకాలను నిర్వీర్యం చేశారని.. మంత్రి అసమర్థతతోనే రైతులు ఆర్థికంగా నష్టపోయారని అన్నారు. చిలకలూరిపేటకు ఈ దుస్థితి ఎందుకు తెచ్చారో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news