సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా – జలగం వెంకటరావు ప్రకటన

-

సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేసా…ఇకపై కూడా పని చేస్తానని జలగం వెంకటరావు ప్రకటన చేశారు. ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులును కలిసిన జలగం వెంకట్ రావు… ఈ సందర్భంగా హైకోర్టు తీర్పు కాపీలను అసెంబ్లీ కార్యదర్శికి అంద చేశారు. అనంతరం జలగం వెంకటరావు మాట్లాడుతూ.. నాది నైతిక విజయం అని చెప్పారు.

హై కోర్టు తీర్పును స్పీకర్ కార్యాలయాములో అందచేశానని వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో పనిచేసాము…పని చేస్తాను అని చెప్పారు. BRS నాయకత్వం తో నేను టచ్ లో ఉన్నానని… 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఒక్కరినే BRS పై గెలిచానని గుర్తు చేశారు. నేను మళ్ళీ న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నానని పేర్కొన్నారు జలగం వెంకటరావు.

Read more RELATED
Recommended to you

Latest news