BREAKING : తెలంగాణ అసెంబ్లీ దగ్గర హై అలర్ట్.. 144 సెక్షన్‌ అమలు

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి మొదలుకానున్నాయి. ఈ సమావేశాల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ నిర్వహణపై ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక ఇవాళ ఉదయం 11:30 గంటలకు ఉభయ సభలు మొదలవుతాయి.

శాసనసభలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాపం ప్రకటిస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది.ఇక నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అసెంబ్లీ చుట్టూ 4 కిలోమీటర్ల మేర 144 సెక్షన్ విధించారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, గుంపులుగా వెళ్లడంపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. సమావేశాలు ముగిసే వరకు ఆంక్షలు ఉంటాయని… అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news