సీఎం కేసీఆర్ కు బడితపూజ చేయాలి – షర్మిల ట్వీట్

-

సీఎం కేసీఆర్ కు బడితపూజ చేయాలని వైఎస్‌ షర్మిల ట్వీట్ చేశారు. వరద బాధితులకు సాయం అందక చస్తుంటే కేసీఆర్ చారిత్రక నిర్ణయాలపై సంబురాలు చేసుకోవాల్నా చిన్న దొర? వర్షాలకు ఇండ్లు కూలి, వరదల్లో కొట్టుకుపోయి 41 మంది ప్రాణాలు పోతే మీకు సంతోషమా? 10 వేల ఎకరాల్లో పంటలు మునిగి అన్నదాత కన్నీరు పెడుతుంటే మీకు సంబరమా? అంటూ నిలదీశారు.

రైతన్నలకు రూ.2 వేల కోట్ల నష్టం జరిగితే మీకు సంబరమా? చారిత్రక నిర్ణయాలు అంటే ఏంటి? మీ అయ్య రుణమాఫీ చేయకపోవడమా? నిరుద్యోగ భృతి ఎగ్గొట్టడమా? డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకపోవడమా? ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోవడమా? క్వశ్చన్ పేపర్లు అమ్ముకోవడమా? 104 సేవలను ఎత్తేయడమా? రూ.4 లక్షల కోట్లు పంది కొక్కుల్లా పీక్కుతినడమా? సిగ్గు లేకుండా వరద బాధితులకు రూ.10 వేలు ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ ది అంటూ మండిపడ్డారు.

పంట పరిహారం ఇవ్వకుండా, పంట బీమా ఇవ్వకుండా నిండా ముంచిన హిస్టరీ కేసీఆర్ ది. పోడు పట్టాల పేరుతో, బీసీ బంధు, మైనార్టీ బంధు పేరుతో దగా చేసిన చరిత్ర కేసీఆర్ ది. కరెంట్ నుంచి రిజిస్ట్రేషన్ల వరకు రేట్లు పెంచి, ప్రజల రక్తం తాగిన చరిత్ర కేసీఆర్ ది. వీధికో బెల్టు షాపు పెట్టి, మహిళల మంగళ సూత్రాలు తెంపిన చరిత్ర కేసీఆర్ ది. మీ దిక్కుమాలిన నిర్ణయాలకు, దగాకోరు పాలనకు, మోసపూరిత హామీలకు కేసీఆర్ కు చేయాల్సింది సంబురాలు కాదు బడితపూజ. సంబరాలు చేసుకుంటుంది తెలంగాణ ప్రజలు కాదు కేసీఆర్ కుటుంబం మాత్రమేనన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news