ఓటమి భయంతో జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు – కన్నా లక్ష్మీనారాయణ

-

ఓటమి భయంతోనే సీఎం జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు టిడిపి నేత, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ. శనివారం సత్తుపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సభలకు, లోకేష్ పాదయాత్రకు ప్రజాదరణ పెరిగిందని తెలిపారు. ఆ కారణంగానే చంద్రబాబు పర్యటనలో వైసిపి గుండాలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు కన్నా లక్ష్మీనారాయణ. ఇక ఈ నెల 9న సత్తెనపల్లి నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, దాడులు చేసినా రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news