BREAKING : కాలువలోకి దూసుకెళ్లిన కారు..ముగ్గురు మృతి

-

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది ఓ కారు. ఈ సంఘటన లో ఏకంగా ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు కావడంతో రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు అధికారులు.

మృతి చెందిన వారిలో ఒకటి మృత దేహం లభ్యం కాగా.. గల్లంతైన ఇద్దరి కోసం గాలిస్తున్నారు పోలీసులు. గోకవరం నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న సమయంలో కారు ఈ ప్రమాదానికి గురైంది.వీరవల్లి గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్… మృతదేహం లభ్యం అయింది. టి .హేమంత్, దూడే హర్షవర్ధన్ యువకుల మృత దేహాలు మాత్రం గల్లంతయ్యాయి. వీరంతా ఏలూరు శ్రీ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నారు. ఇక ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news