Mithun Reddy: ఏపీ చరిత్రలో కులగణన చేసిన ఏకైక సీఎం జగన్

-

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కులగణన చేసిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. సోమవారం చిత్తూరు జిల్లా రాజంపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్ర మొదలైనప్పటినుండి యాదవ రాజులు దేశాన్ని పాలించారని అన్నారు. రాజ్యసభలో ఇద్దరు యాదవ సోదరులకు అవకాశం కల్పించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు.

నాలుగు ఎమ్మెల్సీలకు కూడా అవకాశం కల్పించారని అన్నారు. రాష్ట్రంలో 25 లక్షలకు పైనే యాదవులు ఉన్నారని తెలిపారు. ఆర్ కృష్ణయ్య బీసీ కమ్యూనిటీలో యాదవ వర్గానికి చెందిన వ్యక్తి అని.. బీసీల కోసం పోరాటం చేయాలని చెప్పారని అన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో యాదవులందరి ఆశీస్సులు తనపై ఉండాలని కోరారు మిథున్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news