IND VS IRE : అరుదైన రికార్డును నెలకొల్పిన బుమ్రా

-

టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. వెస్టిండీస్ జట్టుపై సిరీస్ కోల్పోయిన టీమిండియా ఐర్లాండ్ లో మాత్రం శుభారంభం చేసింది. ఐర్లాండ్ జట్టుపై ఏకంగా రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. మ్యాచ్ కు వర్షం అడ్డు తగలడంతో టీమిండియా డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విజయం సాధించింది.

అయితే… ఐర్లాండ్ తో జరిగిన తొలి టి20లో భారత్ విజయం సాధించగా… కెప్టెన్ బుమ్రా అరుదైన రికార్డును నెలకొల్పారు. బుమ్రా 4 ఓవర్లలో 24 రన్స్ తో రెండు వికెట్స్ తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నారు. దీంతో టి20 కెప్టెన్సీ అరంగేట్రంలోనే అవార్డును గెలుచుకున్న తొలి ఇండియన్ క్రికెటర్ గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. రేపు రెండో టి20 జరగనుంది. ఐర్లాండ్ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంటుందా? అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news