చంద్రబాబుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు – విజయసాయిరెడ్డి

-

చంద్రబాబుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు పేల్చారు. చంద్రబాబు పై మరోసారి ఎంపీ విజయసాయిరెడ్డి పోస్ట్‌ పెట్టారు. చంద్రబాబు గారు ఇచ్చే రాఖీ కట్టుకుంటే ఇంటర్ బైపీసీ చదివి ఇంజనీర్ కావచ్చని ఎద్దేవా చేశారు. పోలీస్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు…. ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్తే నోబెల్ ప్రైజ్ రావచ్చనంటూ ర్యాగింగ్‌ చేశారు సాయిరెడ్డి.

స్వాతంత్ర్య ఉద్యమంలోనూ పాల్గొనవచ్చు… అది నేనే కట్టా, ఇది నేనే పెట్టా అని మాట్లాడొచ్చని ఎద్దేవా చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టొద్దంటూ హైద్రాబాద్ లో కూర్చొని ఏపీ విపక్షనేత చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపును బట్టి…వారి నిరాశ, నిస్పృహలను అర్థం చేసుకోవచ్చు అంటూ చురకలు అంటించారు. 2019లో ఎదురైన ఓటమి వల్ల పగతో రగిలిపోతున్నారు. 2024లో మళ్ళీ ఓడిస్తే అర్ధంలేని మాటలు మానేసి వారు మామూలు మనిషి అవుతారన్నారు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news