రుషికొండపై మంత్రి రోజావి పనికిమాలిన మాటలు – అయ్యన్నపాత్రుడు

-

విశాఖ భీమునిపట్నం ప్రాంతం తుర్లవాడ కొండపై 120 ఎకరాలు కాజేసేందుకు ఏ-2 విజయసాయిరెడ్డి కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు టిడిపి పోలీస్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు. తుర్లవాడ ఆధ్యాత్మిక క్షేత్రం అని.. దీని జోలికి రావొద్దని హెచ్చరించారు. విజయసాయిరెడ్డి తన కూతురు విద్యాసంస్థల నిర్మాణం కోసం 120 ఎకరాలు కేటాయించాలని జగన్ రెడ్డిని కోరారన్నారు. రూ.300 కోట్ల విలువైన భూమిని విజయ సాయిరెడ్డికి బహుమతిగా ఇవ్వడానికి జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.

ప్రజల ఆస్తిని జగన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు దానం చేస్తున్నారని మండిపడ్డారు. కొండపై 120 అడుగుల నరసింహస్వామి విగ్రహం ప్రతిష్టించాలని స్థానికులు టీటీడీని కోరుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే టీటీడీ, సింహాచలం ఆస్తులు దోచేశారని.. దేవుడిని టచ్ చేయవద్దని జగన్ రెడ్డిని కోరుతున్నానన్నారు. ఇప్పటికే విశాఖలో జగన్ రెడ్డి అండ్ కో రూ.70 వేల కోట్ల ఆస్తులు దోచుకున్నారని కీలక ఆరోపణలు చేశారు. రుషికొండపై మంత్రి రోజా పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విశాఖలో దోపిడీపై సీనియర్ నేతలు బొత్స, ధర్మాన ఎందుకు మాట్లాడటం లేదు..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news