మంత్రి హరీశ్‌రావుకు రూ.50 లక్షల జరిమానా.. ఎందుకంటే..?

-

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు రూ.50 లక్షల జరిమానా పడింది. విచిత్రం ఏంటంటే తనకు తానే ఈ జ‌రిమానా విధించుకున్నారు. అదెలా? ఎందుకు? అంటే.. మహిళలకు మెప్మా రుణాలు, చెత్తబుట్టల పంపిణీ కోసం మధ్యాహ్నం 11:30 గంటలకు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మంత్రి హరీశ్‌ సభ ఖరారైంది. తీరా హరీశ్‌.. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి సభాస్థలికి చేరుకునే సరికి మధ్యాహ్నం 3:30 అయింది.

అప్పటిదాకా ఎంతో ఓర్పుగా వేచి చూస్తున్న మహిళలకు హరీశ్‌ క్షమాపణలు చెప్పారు. పరిహారంగా తనకు జరిమానా విధించాలని వారిని కోరారు. దీంతో తమకు మహిళా భవనం కోసం నిధులను మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి సరేనన్నారు. మహిళా భవన నిర్మాణానికి రూ.50లక్షలను మంజూరు చేయిస్తానని వారికి హామీ ఇచ్చారు. వెంటనే ఈఎన్‌సీ కృష్ణారావుతో ఫోన్లో మాట్లాడి.. నిధులను మంజూరు చేయించాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news