సెంచరీ తో సత్తా చాటిన మయాంక్ అగర్వాల్ … 57 బంతుల్లో వీరబాదుడు

-

కర్ణాటక దేశవాళీ లీగ్ అయిన మహారాజ ట్రోఫీ లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం బెంగుళూరు బ్లాస్టర్స్ మరియు మైసూర్ వారియర్స్ మధ్యన జారీఫైనా మ్యాచ్ లో బ్లాస్టర్స్ ఈ సీజన్ లోనే మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగుళూరు బ్లాస్టర్స్ నిర్ణీత ఓవర్ లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ముందుండి సెంచరీ (105) చేసి జట్టుకు ఛాలెంజింగ్ టోటల్ ను అందించాడు. ఇతని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు మరియు 6 సిక్సులు ఉన్నాయి. ఇక ఇతనికి సూరజ్ అహుజా నుండి చక్కని సహకారం లభించింది. కాగా ఇప్పటికే పూర్ ఫామ్ తో దాదాపుగా టీం ఇండియా నుండి చాలా దూరం అయ్యేలా ఉన్న మయాంక్ కు ఈ ఇన్నింగ్స్ ఏమైనా అవకాశాలు తెస్తుందా చూడాలి.

కాగా ఈ స్కోర్ ను చేధించే క్రమంలో మైసూర్ వారియర్స్ 202 పరుగులకు మాత్రమే పరిమితం అయింది. ఒకదశలో మైసూర్ గెలుస్తుందని అనుకున్నారు.. కానీ చివరికి పరుగులకు దూరంలో నిలిచిపోయి ఓటమి పాలయింది. దీనితో ఈ సీజన్ లో బెంగుళూరు బ్లాస్టర్స్ మొదటి విజయాన్ని అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news