క్యాన్సర్ తో మరాఠీ నటుడు మృతి … !

-

తాజాగా ప్రముఖ మరాఠీ నటుడు మిలింద్ సఫాయ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఈ రోజు ఉదయం తన తుదిశ్వాసను విడిచారు. కుటుంబ సభ్యుల నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతున్న మిలింద్ సడెన్ గా ఈ రోజు మరణించడంతో మరాఠీ సినీ అభిమానులకు తీరని లోటు అని చెప్పాలి. ఇక ఈ విషాద వార్తతో సినీ లోకం మూగబోయింది, మొదటగా మిలింద్ చిన్న చిన్న సీరియల్స్ లో నటిస్తూ… సినిమా పరిశ్రమలోకి ప్రవేశించింది. అక్కడ కూడా తన టాలెంట్ తో కొన్ని సినిమాల్లో నటించి అభిమానుల మెప్పును పొందాడు. ఈయన నటించిన సినిమాలలో మేకప్, పోస్టర్ బాయ్స్, థాంక్ యు విఠలా లు ఉన్నాయి. దేశంలో ఎందరో సినీ ప్రముఖులు వివిధ రకాల కారణాలతో అకాల మరణం చెందుతున్నారు. రేపు ఈయన మృతదేహానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేయనున్నారు.

ఇక ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖులు మరియు మిత్రులు తమ ప్రఘాడ సానుభూతిని తెలియచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news