కేసీఆర్ బీజేపీకి తొత్తుగా మారాడు – సీపీఐ నారాయణ

-

కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మోడీ, రాష్ట్రంలో జగన్ చేతులలో నుండి రాష్ట్రాన్ని కాపాడాలని సిపిఐ ప్రయత్నం చేస్తుందన్నారు. క్రిమినల్ ఆలోచనలు ఉన్న అమిత్ షా వల్లే మణిపూర్ లాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. మణిపూర్ లాంటి అల్లర్లను అడ్డుపెట్టుకొని మతం చాటున అధికారంలోకి వచ్చేందుకు బిజెపి ప్రయత్నిస్తుందన్నారు.

బిజెపి దేశంలో అల్లర్లకు, మతతత్వ ఆందోళనలకు ఆద్యం పోసిందన్నారు. నిన్న మొన్నటి వరకు మోడీపై మొరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు బిజెపికి అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ కేంద్రానికి లొంగిపోయాడని ఆరోపించారు. ఇక సీఎం కేసీఆర్ తన కూతుర్ని లిక్కర్ స్కామ్ నుండి బయటపడేసేందుకు బిజెపికి తొత్తుగా మారాడని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news