ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల దృష్ట్యా వైసీపీ మరియు టీడీపీ నేతల మధ్యన మాటల యుద్ధం నడుస్తోంది, టీడీపీ ఏమో వైసీపీ అవినీతి పాలనకు వచ్చే ఎన్నికల్లో ముగింపు పలుకుతామని మాట్లాడుతుంటే, వైసీపీ నేతలు సంక్షేమ పథకాలే జగన్ పాలనకు నిలువెత్తు నిదర్శనం… వారే జగన్ ను గెలిపించుకుంటారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా తాజాగా మంత్రి రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేస్తూ ముందు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి చూపించి ఆ తర్వాత వైసీపీని ఓడించే విషయం గురించి ఆలోచించు అంటూ మాట్లాడింది. 2024 లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా 175 కి 175 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తుంది అంటూ ధీమాను వ్యక్తం చేసింది మంత్రి రోజా. జగన్ ను ఓడించే వాడు ఆడించే వాడు ఇంకా పుట్టలేదు అంటూ రోజా టీడీపీ జనసేనలకు హెచ్చరిక జారీ చేసింది.
జగన్ ను ఓడించాలంటే అవతలి ప్రత్యర్థి కూడా జగన్ అయి ఉంటేనే సాధ్యం అవుతుందంటూ రోజా తమ నాయకుడి సామర్ధ్యాన్ని తెలియచేసింది.