చంద్రబాబు మాటలు ప్రజలు ఇంకా మరిచిపోలేదు : మంత్రి మేరుగు

-

టిడిపి అధినేత చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ఎన్నో రకాలుగా మాట్లాడారని.. అప్పట్లో ప్రత్యేక హోదా సంజీవనిన అనే మాటలు ప్రజలు మర్చిపోలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్యాకేజిస్తున్నారంటూ కేంద్ర పెద్దలను సన్మానించిన సంగతి కూడా అందరికీ గుర్తుకుందని తెలిపారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మాటలు మార్చుకున్నారు అంటూ దుయ్యబట్టారు.

తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ఖాళీ అయిందని పేర్కొన్నారు. పార్టీలోకి ఎవరు వెళ్తారు. టిడిపి మునిగిపోయే పడవ అని.. ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబు నాయుడుకు లేదన్నారు. అందుకే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని పేర్కొన్నారు మంత్రి నాగార్జున. చంద్రబాబు భవిష్యత్ కి గ్యారెంటీ లేదని.. ప్రజలకు ఆయన ఏం షూరిటీగా ఉంటారని ఎద్దేవా చేశారు మంత్రి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు ఆగం చేస్తే.. జగన్ దానిని సరి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంతగానో అభివృద్ధి చెందుతుందని.. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం అభివృద్ధి జరగలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news