టీడీపీ గేట్లు ఎత్తితే… వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి లేదు – మంత్రి మేరుగ నాగార్జున

-

టీడీపీ గేట్లు ఎత్తితే… వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి లేదని చురకలు అంటించారు మంత్రి మేరుగ నాగార్జున. వైసీపీ బలీయంగా ఉందని..చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. టీడీపీ గేట్లు ఎత్తితే వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటుందా?? అని నిలదీశారు. చంద్రబాబు మానసిక సమతౌల్యాన్ని కోల్పోయారని.. వేరే పార్టీ నేతలను ట్రై చేయాల్సిన అవసరం మా పార్టీకి లేదన్నారు.

ఏ పార్టీ అయినా వైసీపీతో కలిసి రావాల్సిందేనని.. భావి తరాల భవిష్యత్తు కోసం మేం రాజకీయం చేస్తున్నామని ప్రకటించారు. అవసరాన్ని బట్టి చేరికలు ఉంటాయని… ఏ నాయకుడు అయినా వైసీపీ అడుగు జాడల్లో నడవాల్సిందేనని వెల్లడించారు. 175 నియోజకవర్గాల్లో పోటీకి అభ్యర్ధులు లేకనే చంద్రబాబు పొత్తుల కోసం పాకులాడుతున్నారని ఆగ్రహించారు మంత్రి మేరుగ నాగార్జున.

Read more RELATED
Recommended to you

Latest news