చంద్రబాబు టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా టీడీపీలోనే : మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి

-

చంద్రబాబు టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా టీడీపీలోనే ఉంటానని  మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తన మనస్సులోని మాటను బయటపెట్టారు. తాను బీజేపీ నేత జాతీయ అధ్యక్షుడితో కలిసి ఫొటో దిగినట్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఆ ఫొటోలో ఉన్నది తాను కాదని.. తన ఫొటో మార్ఫింగ్ చేశారని పేర్కొన్నారు.

తన ఫోటో మార్ఫింగ్ ఫై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాను. త్వరలోనే నిజా నిజాలు వెలుగులోకి వస్తాయని వెల్లడించారు మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి. చంద్రబాబు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను టిడిపి పార్టీలోనే కొనసాగుతాను స్పష్టం చేశారు. చంద్రబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తన వంతుగా కృషి చేస్తానని వెల్లడించారు మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news