కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీకి చెన్నమనేని రాజేశ్వరరావు పేరు

-

దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నీటి ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీకి స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్ రాజకీయ నేత, దివంగత చెన్నమనేని రాజేశ్వర రావు పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆయన చేసిన సామాజిక సేవను గుర్తిస్తూ.. గురువారం రోజున రాజేశ్వరరావు శతజయంతి సందర్భంగా మల్కపేట జలాశయంతో పాటు ఆ పరిధిలోని కాల్వలకు ఈ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల పరిథిలో సాగు, తాగునీరు అందిస్తున్న మధ్యమానేరు నుంచి ఎగువ మానేరు వరకు జలాశయం, కాల్వలకు చెన్నమనేని రాజేశ్వరరావు పేరు పెడుతూ ఈ విధంగా కేసీఆర్ నిర్ణయించారు.

Kaleswaram project

స్వాతంత్య్ర సమరయోధుడుగా, తెలంగాణ మొదటితరం రాజకీయ వేత్తగా, నిరంతరం ప్రజల కోసం పోరాడిన గొప్పనేత చెన్నమనేని రాజేశ్వర రావు అని సీఎం కేసీఆర్ అన్నారు. పలు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ ప్రాంత ప్రజల సాగు, తాగునీటి కష్టాలను తీర్చడానికి ఎత్తిపోతల పథకం కోసం చెన్నమనేని రాజేశ్వరరావు ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. ఆనాటి చెన్నమనేని రాజేశ్వరరావు ఆకాంక్షలను ప్రతిఫలించేలా.. స్వరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను నిర్మించుకున్నామని కేసీఆర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news