చంద్రబాబు అరెస్ట్ తో మరణించిన వారి కుటుంబాలకు బాలయ్య శుభవార్త !

-

చంద్రబాబు అరెస్ట్ తో మరణించిన వారి కుటుంబాలకు బాలయ్య శుభవార్త చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ తో ప్రాణాలు కోల్పోతున్న కుటుంబాలను త్వరలోనే పరామర్శంచడానికి వెళ్తానని…వారిని ఆదుకుంటామన్నారు. కష్టకాలం లో ఉన్న పార్టీ కోసం నేను ముందు ఉండి పోరాడతానని టీడీపీ క్యాడర్‌ కు భరోసా కల్పించారు. చంద్రబాబు కడిగిన ముత్యం లా బయటకు వస్తాడని స్పష్టం చేశారు.

టిడిపి అధ్యక్షుడు పై కక్ష సాధింపు చేస్తున్నారని..స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి ఆరోపణలు చేసి చంద్రబాబు పై బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు నందమూరి బాలకృష్ణ. చంద్రబాబు అభివృద్ధి కి బ్రాండ్ అంబాసిడర్…ఇది ప్రపంచానికి తెలుసు…ఎటువంటి ఆధారాలు లేని స్కాం నీ ప్రభుత్వం క్రియేట్ చేసిందని ఆగ్రహించారు.

అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు ఒక బ్రాండ్. ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు ఉపక్రమించారు జగన్. జగన్‌ 16 నెలలు జైలులో ఉండి వచ్చారు. చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని జగన్‌ కుట్ర పన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ముందుగా గుజరాత్‌లో ప్రారంభించారు. సీఎం కేవలం పాలసీ మేకర్… అధికారులే అమలు చేస్తారు. అవినీతి జరిగిందని సృష్టించి చంద్రబాబును అరెస్టు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్షసాధింపుతోనే కుట్ర చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news