చంద్రబాబు అభిమానుల ర్యాలీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మద్దతు

-

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెలంగాణలో ఉన్న టీడీపీ, చంద్రబాబు అభిమానులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. పలు పార్టీల నేతలు వీరికి మద్దతు పలుకుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ వనస్థలిపురంలో చంద్రబాబు మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎల్బీనగర్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, బీజేపీ కార్పొరేటర్‌ కొప్పుల నరసింహారెడ్డి తదితరులు పాల్గొని టీడీపీ అభిమానులకు సంఘీభావం తెలిపారు.

పనామా సర్కిల్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. నల్ల జెండాలు, ప్లకార్డులతో అభిమానులు నిరసనలో పాల్గొన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. వెంటనే బాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారంతా జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా నివాదాలు చేశారు.

మరోవైపు ఖమ్మంలో చంద్రబాబుకు సంఘీభావంగా భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబును అరెస్టును మహిళలు ముక్తకంఠంతో ఖండించారు. ‘చంద్రబాబు అభిమానులు’ పేరుతో ఖమ్మంలో ఎన్టీఆర్ చౌరస్తా నుంచి మయూరి సెంటర్ వరకు ర్యాలీ చేశారు. నల్లజెండాలు, ప్లకార్డులతో ర్యాలీలో చంద్రబాబు అభిమానులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news