అక్టోబర్ రెండో వారంలో బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ : కిషన్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తులను ముమ్మరం చేసింది. బహుషా ఈనెల రెండో వారం తరువాత బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తరువాత కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

అక్టోబర్ 5న నాంపల్లి లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పదాదికారుల సమావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా అక్టోబర్ 06న జేపీ నడ్డా అధ్యక్షతన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ రెండు సమావేశాల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించనున్నట్టు వెల్లడించారు. వచ్చే ఎన్నికలకు రాష్ట్రనాయకులకు నడ్డా దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికపై లోతుగా చర్చ జరుగుతుందని తెలిపారు కిషన్ రెడ్డి. ఇక్కడ ఖరారు అయిన అభ్యర్థుల వివరాలను బీజేపీ పార్లమెంటరీ పార్టీ కమిటీకి పంపుతామని తెలిపారు. అక్కడ ఫైనల్ అయిన తరువాత ఢిల్లీ నుంచే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news