ఎమ్మెల్యే శిల్పా రవిపై మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఫైర్..!

-

నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిపై మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే రవి అహంకారంతో విర్రవీగిపోతున్నారని మండిపడ్డారు అఖిల ప్రియ. బహిరంగ చర్చకు పిలిస్తే ఆళ్లగడ్డకు పోలీసులను పంపారని టీడీపీలో ఇద్దరు, ముగ్గురు నేతలు ఉన్నారని ఎగతాళి చేస్తున్నారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ తరుపున చెబుతున్నా.. ఏ లీడర్ నైనా సెలెక్ట్ చేసుకో.. ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు రెడీ అంటూ అఖిలప్రియ సవాల్ విసిరారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు కూడా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ము నీకు ఉందా అంటూ సవాల్ విసిరారు. నీ స్థలాల రేట్లు పెంచుకోవడానికి బొగ్గు లైన్ వాసులను రోడ్డు పాలు చేస్తావా అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. భూమి సరిగ్గా లేని వరదలు వచ్చే కుందు ఉన్న వద్ద పట్టాలిస్తావా అంటూ ఆరోపణలు చేశారు. కుందు ప్రాంతానికి వెళ్లి నువ్వు ఇల్లు కట్టుకొని నీ తండ్రితో కలిసి ఉండగలవా అంటూ ప్రశ్నించారు. బొగ్గు లైన్ వారి కోసం న్యాయపోరాటం చేస్తామని భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news