తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ సతీమణి శోభ

-

తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆమె సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం తిరుమల శ్రీవారి అర్చన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఓవైపు కేసీఆర్​కు వైరల్ ఫీవర్ రావడం.. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆమె శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిసింది. కేసీఆర్​ త్వరగా పూర్తిగా కోలుకోవాలని తిరుమలేశుడిని కోరుకున్నట్లు సమాచారం.

మరోవైపు గత వారం రోజులుగా సీఎం కేసీఆర్ వైరల్ ఫీవర్, బ్యాక్టీరియల్ ఇన్​ఫెక్షన్​తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవలే కేటీఆర్ వెల్లడించారు. అయితే ఆయన త్వరగా కోలుకుంటున్నారని మంత్రి కేటీఆర్ తాజాగా చెప్పారు. మరో రెండ్రోజుల్లో సింహం ఎన్నికల ప్రచారంలో దిగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్​లో పోలింగ్ నవంబర్ 30, ఫలితాలు డిసెంబర్ 3వ తేదీ.. రెండిట్లోనూ 3 ఉందని.. కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలను ఇస్తోందని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news