దత్తపుత్రుడు మూడేళ్లకోసారి ఇల్లాలుని మారుస్తూ ఉంటాడు : సీఎం జగన్

-

ఏపీలో జగనన్న కాలనీ ఇళ్లను ఇవాళ సీఎం జగన్ సామర్లకోటలో ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు జగన్. ముఖ్యంగా దత్త పుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ లోనే ఉందని తెలిపారు. ఫ్యాకేజీ స్టార్ కి ఓడిపోయిన భీమవరంతో, గాజువాకతో సంబంధమే లేదని మండిపడ్డారు. దత్తపుత్రుడు మూడేళ్లకొకసారి ఇల్లాలుని మారుస్తాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిలో ఒకరు స్టేట్, ఒకరు నేషనల్, మరొకరు ఇంటర్నేషనల్ అంటూ సెటైర్లు వేశారు సీఎం జగన్. 

వివాహ వ్యవస్థపై దత్త పుత్రుడికి గౌరవం లేదని.. ఎల్లో బ్యాచ్ కి ప్రజల మీద ప్రేమలేదు. వీళ్లు కావాల్సింది కేవలం అధికారం వీళ్లు కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది హైదరాబాద్ లో పంచుకుంటారు. వీరందరూ మనతోనే చేసేది కేవలం వ్యాపారం మాత్రమేనని పేర్కొన్నారు. తన అభిమానుల ఓట్లను హోల్ సేల్ గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడు. సరుకులు అమ్ముకునే వాళ్లను చూశాం. కానీ పార్టీ సొంతవారిని అమ్ముకునే వాళ్లను ఇప్పుడే చూస్తున్నాం. యూజ్ అండ్ త్రో అన్నది పవన్ కళ్యాణ్ పాలసీ అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news