మైనంపల్లి హనుమంతరావు, రోహిత్ కు సీట్లు ఖరారు

-

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయింది. 55 మందితో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ విడుదల చేసింది. ఇందులో బీఆర్ఎస్ నుంచి వచ్చిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆయన కుమారుడికి సీట్లు దక్కాయి.

Seats for Mainampally Hanumantha Rao and Rohit have been finalized
Seats for Mainampally Hanumantha Rao and Rohit have been finalized

మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావుకు టికెట్ దక్కగా.. మెదక్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి రోహిత్‌రావు సీటు దక్కించుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలకు గాను 5 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.

ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రకటించిన అసెంబ్లీ స్థానాలు

1. సంగారెడ్డి
2. ఆందోల్
3. జహీరాబాద్
4. మెదక్
5. గజ్వేల్

ఇంకా ప్రకటించని స్థానాలు

1. పటాన్ చెరు
2. నారాయణఖేడ్
3. నర్సాపూర్
4. దుబ్బాక
5. సిద్దిపేట

Read more RELATED
Recommended to you

Latest news