కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయడం లేదు : కేటీఆర్

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నో ఏళ్లు అధికారంలో ఉంది.. తెలంగాణ కు ఏం చేసిందని ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటుంది ఇప్పటికే 11సార్లు ఛాన్స్ ఇచ్చారు. కేసీఆర్ ను దించేయాలంటున్నారు. రైతులకు రైతుబంధు ఇచ్చినందుకు దించేయాలా..? దళితులకు దళిత బంధు ఇచ్చినందుకు దించేయాలా..? కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు కేసీఆర్ ని దించేయాలా..? తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజలకు ఏం తక్కువ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించారు.

తెలంగాణ బిడ్డలను బలి తీసుకుంది కాంగ్రెస్ కాదు.. ఆనాడు బలిదేవత అన్న రేవంత్ కి.. ఇవాళ సోనియా దేవత అయిందా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ఇటు రాహుల్ గాంధీ, అటు నరేంద్ర మోడీ ఇద్దరూ కూడా కేసీఆర్ ని దించేయాలంటున్నారు. దేశంలో మీ పెత్తనానికి అడ్డు కట్టా వేస్తాడనే దించేయాలంటున్నారా..? ఏది ఏమైనా కేసీఆర్ దేశ రాజకీయాల్లో తన సత్తా చాటుతాడని స్పస్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news