చంద్రబాబుకు భువనేశ్వరి వల్లే ప్రమాదం.. భోజనం ఆమె పంపిస్తున్నారు -నారాయణ స్వామి

-

చంద్రబాబుకు భువనేశ్వరి వల్లే ప్రమాదం.. భోజనం ఆమె పంపిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. చంద్రబాబు కు ఇంటి నుంచే భోజనం పంపిస్తున్నారు, ఆయనకు ఏదైనా జరిగితే ఆయన భార్య భువనేశ్వరి పైనే మాకు అనుమానం అని పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ను తిట్టిన వారినే నేను తిట్టాను, మా నాయకుడ్ని ఎవరైనా తిడితే ఊరుకోననని హెచ్చరించారు.

ఎన్టీఆర్ ఫోటో తీసేసి ఓట్లు అడగండి నాలుగు సీట్లు గెలిస్తాడా చంద్రబాబు అని ఫైర్‌ అయ్యారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. పుంగనూరు లో పోలీసులు పై దాడి చేయించింది చంద్రబాబు అని ఆగ్రహించారు. పుంగనూరు లో టిడిపి నాయకులు టెర్రరిస్టులు మాదిరే వ్యవహరిస్తున్నారని.. చంపుడు రాజకీయాలు మొదలైంది చంద్రబాబు కుటుంబం నుంచేనన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారు.. కోట్ల రూపాయలు చంద్రబాబు లాయర్లు కు ఖర్చు చేస్తున్నారని తెలిపారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.

Read more RELATED
Recommended to you

Latest news