తెలంగాణ ఎన్నికలు: బీజేపీ లో అసంతృప్తులపై అధిష్టానం ఫోకస్!

-

నవంబర్ 30న తెలంగాణాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటీవల బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాను అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి జాబితాలో ఆశించిన విధంగా చోటు దక్కని బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తిని చూపిస్తున్నారు. ఈ విషయాలు మెల్ల మెల్లగా బయటకు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా మాజీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వర్గానికి సంబంధించి ఎక్కువ సీట్లు కేటాయించలేదని అలకపూనారు. ఆ తర్వాత వివేక్ కూడా తనకు తెలియకుండానే మా ప్రాంత టికెట్లు నిర్ణయించడంపైన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. బీజేపీ నేత రమాదేవి తాను ఆశించిన ముథోల్ టికెట్ రాకపోవడంతో కన్నీరుమున్నీరు అయింది. వీరిని ప్రస్తుతం బీజో అధిష్టానం బుజ్జగించే పనిలో ఉన్నారట.

పార్టీలో ఏ ఒక్కరు అసంతృప్తికి లోనయినా ఇబ్బంది ఉంటుంది, అందుకే రెండవ జాబితాలో మాత్రం ఇలాంటి సమస్యలు రాకుండా.. అందరినీ సంప్రదించిన తర్వాతనే జాబితాను ప్రకటించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news