దోచుకో.. దాచుకో అనుకున్నందుకు చంద్రబాబు జైలు పాలయ్యాడు : మంత్రి కారుమూరి

-

విశాఖపట్నంలోని తగరపువలస పుట్ బాల్ గ్రౌండులో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో వైసీపీ మంత్రులు పాల్గొన్నారు. బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమురు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నారా భువనేశ్వరి అడుగుతున్నట్టు నిజమే గెలిచింది అని ఆయన అన్నారు. దోచుకో.. దాచుకో అనుకున్నందుకు చంద్రబాబు జైలు పాలయ్యాడు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.

YSRCP is ready for elections at any time: Karumuri Nageswar Rao

మేం రెండు ఎకరాల్లో ఆదాయాన్నే తిన్నాము.. ప్రజల సొమ్ము దోచుకో లేదని నారా భువనేశ్వరి దేవుడి మీద ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. యాదవులను టీడీపీ ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంది.. నారా చంద్రబాబు, నారా లోకేశ్, దత్తపుత్రుడిని బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం అని ఆయన వ్యాఖ్యనించారు. ముఖ్యమంత్రిని సైకో అంటున్న నీ అంతు చూస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. తప్పు చేసి నీ బాబు జైలుకు వెళ్ళాడు అంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంది.. కానీ, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలను ముంచింది అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. ఏపీలో ఇంకో 20 ఏళ్లు సీఎంగా జగన్ మోహన్ రెడ్డినే ఉంటాడని ఆయన తెలిపారు.

మంత్రి సిదిర్ మాట్లాడుతూ, చంద్రబాబు.. దొరికిన దొంగచంద్రబాబు.. దొరికిన దొంగ అని, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తింటున్నాడని ధ్వజమెత్తారు. సైకిల్ పోవాలంటూ చంద్రబాబే స్వయంగా ప్రచారంలో చెప్పారని ప్రస్తావించారు. తాను నిప్పంటూ ఇన్నాళ్లు చెప్పిన చంద్రబాబు.. స్కీమ్ల పేరిట అన్ని స్కామ్లు చేసి జైల్లో ఉన్నారని దుయ్యబటారు. ‘బాబు ముసలోడు అయిపోయాడు, ఆయన్ను బయటకు తేవాలంటున్నారు. స్కీమ్ల పేరిట స్కామ్లు చేసిన చంద్రబాబును ప్రజలు నమ్ముతారా?. టీడీపీ నాయకుల్లో ఎవరికైనా దమ్ముంటే.. బాబు తప్పు చేయలేదని బెయిల్ అడగాలి. చట్టంలోని లొసుగుల గురించి మాట్లాడుతున్నారే గానీ.. చంద్రబాబు తప్పు చేయలేదని మాట్లాడటం లేదు’ అని మండిపడ్డారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news