ఎంపీ మాధవ్ పై అగ్గిమీదగుగ్గిలం అయిన జీవీ ఆంజనేయులు !

-

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు గురించి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ దారుణమైన వ్యాఖ్యలు చేశారంటూ వినుకొండ టీడీపీ నేత జీవి అంజనేయులు ఫైర్ అయ్యారు. చంద్రబాబు లాంటి లీడర్ ను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమే కాకుండా నోటికి వచ్చినట్లు.. జైల్లోనే మరణిస్తారు అంటూ పిచ్చికూతలు కూస్తారా అంటూ హిందుపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ ను ఉద్దేశించి జివి ఆంజనేయులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడితే ఒక్కొక్కరిని బట్టలు ఊడదీసి కొడతామంటూ అంజనేయులు మండిపడ్డారు. ఒక ఎంపీ అయి ఉండి ఏ విధంగా మాట్లాడాలి ? ఏమి మాట్లాడంలో ? అన్న సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నాడంటూ మాధవ్ ను ఏకిపారేశారు జివి.

ఏదైనా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చాడు జివి ఆంజనేయులు. టీడీపీ నేత ఆంజనేయులు చేసిన ఈ వ్యాఖ్యల పైన గోరంట్ల మాధవ్ ఏమైనా స్పందిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news