పాతబస్తీలో సభ పెడితే.. నా భార్య తల నరికేస్తామన్నారు-బండి సంజయ్

-

 

 

 

పాతబస్తీలో సభ పెడితే నా భార్య తల నరికేస్తామన్నారని..నా పిల్లలను కిడ్నాప్ చేస్తామన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. అయినా వెనుకంజ వేయకుండా పాతబస్తీలో సభ పెట్టిన చరిత్ర మాదని…పార్టీకి దూరమైనా ధర్మం కోసం పోరాడిన వీరుడు రాజాసింగ్ అని కొనియాడారు.

ప్రాణం పోతున్నా లెక్క చేయకుండా హిందూ ధర్మం కోసం పోరాడే కార్యకర్తలు బీజేపీకే సొంతం అని చెప్పారు. తెలంగాణ ప్రజలేనాడు రాజకీయాలను హర్షించరన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ జైలుకు పోయిన చరిత్ర నాది…కరీంనగర్ లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే మేయర్ పదవి ఎంఐఎం కు ఇచ్చేలా చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపణలు చేశారు.

వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎంకు 30 స్థానాలు కేటాయించి గెలిపించే బాధ్యత బీఆర్ఎస్ కు అప్పగించారన్నారు. ఓడిపోతామనే భయంతోనే పచ్చ జెండా పట్టుకుని దారుస్సలాం పోయి ఒవైసీకి బీఆర్ఎస్ నేతలు సలాం చేశారన్నారు. ఓడిపోతామనే భయంతో బీజేపీ నాయకులను ప్రలోభ పెట్టేందుకు డబ్బు వెదజల్లుతున్నారని ఆగ్రహించారు. దయచేసి తప్పుడు ప్రచారాలు నమ్మకండి…బీఆర్ఎస్ ను ఓడించేందుకు ఆ పార్టీ నేతలే కంకణం కట్టుకున్నారని సెటైర్లు పేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news