బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు : సిద్ధరామయ్య

-

బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని పేర్కొన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ప్రధాని మోడీ వంద సార్లు వచ్చినా గెలిచే అవకాశాలు లేవు అన్నారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది. ఆ పార్టీ నాలుగు ఐదు సీట్లు గెలిస్తే అక్కడికే గొప్ప అన్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓడిస్తాడనే నమ్మకముందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీకి నా పేరు వింటేనే వణుకు పుడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు సిద్ధరామయ్య.

రేవంత్ రెడ్డి రెండు చోట్ల కోడంగల్, కామారెడ్డిలో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్ 30 కోసం తెలంగాణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ ఓడించాలని ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. 34 శాతం బీసీలకు రిజర్వేషన్ ఉంటే సీఎం కేసీఆర్ దానిని 25 శాతానికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి 5 గ్యారెంటీలను అమలు చేస్తుందని.. కర్ణాటకలో 5 గ్యారెంటీలను అమలు చేస్తున్నట్టు తెలిపారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య. దళితులు, వెనుకబడిన వర్గాల వారు ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ వర్గాల పగ్గాలను చేపట్టారా అని ప్రశ్నించారు. దళితులు, బీసీల పట్ల సీఎం కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు సిద్దరామయ్య.

Read more RELATED
Recommended to you

Latest news