పాకిస్తాన్ సెమీస్ ఆశలన్నీ ఆ “డబుల్ సెంచరీ” వీరుడి పైనే !

-

వరల్డ్ కప్ లో ఇక మిగిలిన ఉన్న ఒకే ఒక్క సెమీఫైనల్ స్థానం కోసం పాకిస్తాన్ న్యూజిలాండ్ వెయిట్ చేస్తున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ శ్రీలంక ను చిత్తు చిత్తు గా ఓడించి మంచి రన్ రేట్ ను సాధించి ప్రస్తుతానికి నలుగవ స్థానంలో ఉంది. ఇక ఈ రోజు జరుగుతున్న సౌత్ ఆఫ్రికా మరియు ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ లో ఆఫ్ఘన్ గెలిచినా సెమీస్ కు చేరే ఛాన్సెస్ లేవు. కాబట్టి రేపు జరగనున్న ఇంగ్లాండ్ పాకిస్తాన్ గేమ్ లో, పాకిస్తాన్ అసాధారణ విజయాన్ని అందుకుంటే కానీ కివీస్ కు ఉన్న రన్ రేట్ ను దాటి వెళ్లి సెమీస్ చేరే అవకాశాన్ని పొందలేదు. ఇలా జరగాలంటే పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాట్స్మన్ ఫఖార్ జమాన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడితేనే.. గత మ్యాచ్ లో సూపర్ సెంచరీ తో న్యూజిలాండ్ పై గెలిచి ఛాన్సెస్ ను నిలుపుకున్న పాకిస్తాన్ ను రేపు మరో భారీ ఇన్నింగ్స్ తో జమాన్ పాక్ ను సెమీస్ కు చేరుస్తాడా చూడాలి.

ఇతను కనుక చెలరేగి ఆడితే ఎంతటి బౌలర్ అయినా దడుచుకోవలసిందే. గతంలో ఇతని పేరు మీద డబుల్ సెంచరీ కూడా ఉందన్న విషయం తెలిసిందే. మరి డబుల్ సెంచరీ వీరుడు పాకిస్తాన్ ను సెమీస్ కు చేర్చగలడా లేదా అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news