కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ రాని వాడు కూడా సీఎం అవొచ్చు – రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాని వాడు కూడా ముఖ్యమంత్రి అవుతారని… అయ్యే ఛాన్స్ ఉందంటూ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ రాకపోయినా… తానే ముఖ్యమంత్రి అవుతానని జానారెడ్డి ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే జానారెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చాలా స్వేచ్ఛ ఉందని… టికెట్ రాని వాళ్లు కూడా సీఎం కావచ్చు అంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.

revanth reddy comments on cm post over janareddy

సీఎం కేసీఆర్‌ పూర్వీకులంతా బీహార్‌కు చెందినవాళ్లే అని ఫైర్ అయ్యారు. దోపిడికి పాల్పడుతున్న వారిపై నేను పోరాటం చేస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. గతం గొప్పగా ఉంది కదా అని నెత్తిమీద పెట్టుకుని ఊరేగలేం కదా.. గెలుపు ప్రతిపాదికన టికెట్లు కేటాయించామని స్పష్టం చేశారు. అందుకే మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చామన్నారు. రాజకీయాల్లో కొత్తవారికి ఎవరికీ టికెట్లు ఇవ్వలేదు. రాజకీయాల్లో లేని వారికి కాదు.. ప్రజా జీవితంలో ఉన్న వారికే టికెట్లు ఇచ్చామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news