బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు…వారి అంతు చూస్తా !

-

Balineni srinivas reddy : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు మేయర్ మీద వచ్చిన ఆరోపణలపై విచారణకు చర్యలు తీసుకున్నామని…ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు సిట్ దగ్గరకు వచ్చి ఎందుకు కేసు పెట్టడం లేదన్నారు. బాధితులు వచ్చి కేసు పెడితే విచారణ చేపట్టి నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల వద్ద కూడా ఎటువంటి ఆధారాలు లేవు.. నిరాధార ఆరోపణలు చేయటం సరికాదని ఫైర్‌ అయ్యారు.

భూ ఆక్రమణలపై అధికార పార్టీ ఎమ్మెల్యేల చొరవతో సిట్ వేయించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చేసిన చరిత్ర లేదన్నారు. .30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి తరహా నేరాలు చూడలేదు..పేదల భూములను అక్రమించాలని చూస్తే నాశనం అయిపోతారని వివరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు విశ్రమించేది లేదు..నేను ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు మాజీ మంత్రి బాలి నేని శ్రీనివాసరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news