రష్మిక మార్ఫింగ్ కేసు.. బిహార్‌ యువకుడిని ప్రశ్నిస్తున్న దిల్లీ పోలీసులు

-

టాలీవుడ్ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో ఇటీవల దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. రాజకీయ, సినీ ప్రముఖులు ఈ డీప్​ ఫేక్ వీడియోను ముక్తకంఠంతో ఖండించారు. దీనిపై కేంద్రం కూడా వెంటనే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ వీడియోను తొలుత పోస్టు చేసిన ఓ ఐపీ అడ్రస్​ను కేంద్ర ఐటీ శాఖ అధికారులు కనిపెట్టారు. దాని ద్వారా ట్రేస్ చేసి ఆ ఖాతాదారుడిని గుర్తించారు.

Rashmika Mandanna

రష్మిక వీడియోను తొలుత తన ఖాతాలో అప్​లోడ్ చేసి తర్వాత ఇతర అకౌంట్లలో షేర్ చేసిన బిహార్ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితుడి సోషల్ మీడియా అకౌంట్ నుంచి రష్మిక మార్ఫింగ్‌ వీడియో అప్‌లోడ్‌ అయిందని దిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అతడికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. అయితే ఆ యువకుడు ఇన్​స్టాగ్రామ్ నుంచి ఆ వీడియోను డౌన్​లోడ్ చేసినట్లు విచారణలో చెప్పాడని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news